Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

నాగ్ పూర్ సోలార్ కంపెనీలో పేలుడు.. 9 మంది దుర్మరణం

  • క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ఘోరం
  • ప్యాకింగ్ చేస్తుండగా పేలుడు
  • ఫ్యాక్టరీకి చేరుకున్న ఎమర్జెన్సీ టీమ్, అధికారులు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సోలార్ కంపెనీలో పేలుడు జరిగి తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. నాగ్ పూర్ లోని బజార్ గావ్ గ్రామంలోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈ ఘోరం జరిగింది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ సమయంలో సడెన్ గా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు.

మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన సమాచారం అందగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా బజార్ గావ్ లోని కంపెనీ వద్దకు చేరుకున్నారు. గాయపడిన కార్మికులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

Related posts

దారుణం.. బాణసంచా పేలి 11 మంది దుర్మరణం

Ram Narayana

సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల సజీవ దహనం

Ram Narayana

థానే రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..

Ram Narayana

Leave a Comment