Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా -14 న బీజేపీలోకి…

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా -14 న బీజేపీలోకి
-10 .30 గంటలకు అనుచరులతో గన్ పాక్ వద్ద అమరులకు నివాళి
-తరువాత అసెంబ్లీ సెక్రటరీ కి రాజీనామా సమర్పణ
-కరోనా నేపథ్యంలో స్పీకర్ కార్యాలయానికి రాలేక పోతున్నారని సమాచారం

 

మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ కు గురైన ఈటల కొన్ని రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా తోపాటు ఇతర ముఖ్యనేతలను కలిశారు. బీజేపీ నుంచి సరైన హామిపొందిన తరువాతనే ఆ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపారని తెలుస్తుంది.

ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆరోజే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చేయలేదు… అనంతరం ఆయన నియోజవర్గమైన హుజురాబాద్ లో పర్యటించారు. తాను పార్టీ పెట్టలేదు … పార్టీలో చేరలేదని మాటలు తో ఆయన స్వరంలో మార్పు వచ్చిందని పరిశీలకులు భావించారు.మొత్తానికి బీజేపీ లో చేరడం ఆయనకు అంతగా ఇష్టం లేనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున తనకు రక్షణ ఉంటుందని భావించారని సమాచారం.

బీజేపీ లో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని రాజీనామా లేఖ అందజేసేందుకు అసెంబ్లీ కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం పంపగా కరోనా బాగా వ్యాపిస్తుండటంతో కార్యాలయానికి రాలేక పోతున్నానని తెలిపారు.రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేయమని చెప్పినట్లు తెలుస్తుంది.రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందించడంతో పాటు టీఆర్ యస్ కార్యాలయానికి కూడా మెస్సెంజర్ లేదా ఇమెయిల్ ద్వారా పంపాలని ఈటల నిర్ణయించుకుంట్లు సమాచారం.

Related posts

ఎలా కావాలనుకుంటే అలా పిలుచుకోండి మిస్టర్ మోదీ… కానీ మేం ‘ఇండియా’నే: రాహుల్ గాంధీ

Ram Narayana

పేదలకు ఉపాధి లేకుండా చేసే కుట్ర …కేంద్రంపై వ్యవసాయ కార్మికసంఘ నేత బి.వెంకట్ ధ్వజం…

Drukpadam

కేసీఆరే అధ్యక్షుడు …కేటీఆర్ మరికొద్ది కాలం ఆగాల్సిందే -రంగంలోకి దిగిన మంత్రులు!

Drukpadam

Leave a Comment