తెలంగాణ వార్తలు

మూసీ పునర్జీవం అధ్యయనానికి మంత్రులు పొంగులేటి, పొన్నం దక్షణ కొరియా పర్యటన

ఈ నెల 21 నుంచి దక్షిణ కొరియా పర్యటనకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

  • మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి సియోల్ పర్యటన
  • ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పర్యటన
  • సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని పరిశీలించనున్న బృందం

మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు త్వరలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా పర్యటించనున్నారు. సియోల్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

ఈ పర్యటనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, 12 మంది ఎమ్మెల్యేలు,  మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్‌తో పాటు మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్లనున్నారు.

Related posts

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. ఇకపై ఆ టెస్ట్ తప్పనిసరి!

Ram Narayana

సహకార సంఘాల కాలపరిమితి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Ram Narayana

తెలంగాణలో డిసెంబర్‌లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు…!

Ram Narayana