అంతర్జాతీయం

పాకిస్థాన్‌‌లోని సదస్సుకు నరేంద్రమోదీ వస్తే సంతోషించేవాడిని: నవాజ్ షరీఫ్

  • పాక్‌లో ఎస్సీవో సదస్సుకు హాజరైన జైశంకర్
  • జైశంకర్ రాక సానుకూల పరిణామమన్న నవాజ్ షరీఫ్
  • మరో 75 ఏళ్లు నష్టపోవద్దన్న నవాజ్ షరీఫ్

షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ వస్తే బాగుండేదని… తాను మరింత సంతోషించేవాడినని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ సదస్సుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హాజరయ్యారు. జైశంకర్ హాజరు కావడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఇది సానుకూల పరిణామం అన్నారు. ఇరుదేశాలు మరో డెబ్బై ఐదు సంవత్సరాలు నష్టపోరాదని అభిప్రాయపడ్డారు.

గతాన్ని పక్కనపెట్టి ఇంధనం, వాతావరణ మార్పుల వంటి భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించుకోవాలన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య చాలాకాలంగా నిలిచిపోయిన శాంతిచర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు పురోగతి సాధించాలంటే ఉద్రిక్తతలు ఉండరాదన్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై స్పందిస్తూ… చర్చలను ఎక్కడ ఆపేశామో… అక్కడి నుంచి తిరిగి ప్రారంభించాలన్నారు.

Related posts

అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగలేదు…

Ram Narayana

కర్క్ ను చంపిన హంతకుడు లొంగిపోయాడు: ట్రంప్ ప్రకటన

Ram Narayana

గాజాలో తీవ్ర కరవు నెలకొంది: అధికారికంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి!

Ram Narayana