ఢిల్లీలో వ్యవసాయా, జౌళి , పట్టు పరిశ్రమలు , కో-ఆపరేటివ్ మంత్రి తుమ్మల
వ్యవసాయసదస్సులో ఇంగ్లీష్ ప్రసంగం
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ని కలిసి వరద సహాయం కోరిన తుమ్మల
ఈ రోజు డిల్లీలో జరిగిన “ఫుడ్ ఇండియా” వ్యవసాయ సదస్సులో ప్రసంగించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ” తుమ్మల నాగేశ్వరరావు”
గురువారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, మోనిన్ ఇండియా ఎండీ జెర్మైన్ అరౌద్, బిఎల్ అగ్రో ఎండీ నవనీత్ రవికర్ లతో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యి తెలంగాణ రాష్ట్రంలో లభ్యమయ్యే అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని వారికి ఆహ్వానించారు. అదే విధంగా సదస్సులో భాగంగా భారత్ మండపంలోని హాల్ నం 2 లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ను సందర్శించి రాష్ట్రానికి చెందిన పలు స్టాల్ లను పరిశీలించారు….
ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ని కలిసి ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలతో నష్టపోయిన వ్యవసాయ రంగం గురించి వివరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు …