జాతీయ వార్తలు

స్టేజ్ పై కంటతడి పెట్టుకున్న హీరో విజయ్…

  • మధురైలో టీవీకే పార్టీ ‘మానాడు’ పేరుతో భారీ బహిరంగ సభ
  • లక్షలాది మంది అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన విజయ్
  • బీజేపీతో ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేసిన విజయ్
  • డీఎంకేను గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటన
  • తమిళనాడులో సింహం వేట మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు

తమిళ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్… తన పార్టీ తొలి ‘మానాడు’లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాది మంది అభిమానులను, కార్యకర్తలను చూసి వేదికపైనే కంటతడి పెట్టారు. పార్టీ జెండాను ఆవిష్కరించే సమయంలో జనసందోహాన్ని చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన విజయ్, తన రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తూ అధికార, ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో తనకు శత్రుత్వం ఉందని, ఆ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేను గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.

తమిళనాడులో సింహం వేట మొదలైందంటూ తన రాజకీయ ప్రత్యర్థులకు విజయ్ గట్టి హెచ్చరిక పంపారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, కచ్చితంగా విజయం సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనకు కులం, మతం ముఖ్యం కాదని, తమిళ ప్రజల సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యత అని విజయ్ స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Related posts

ఆ పుస్తకం మేం పబ్లిష్ చేయలేదు.. నరవణె బుక్ పై పెంగ్విన్ సంస్థ వివరణ…

Ram Narayana

బీజేపీపై ముకుల్ కుమారుడి ఫైర్,,,

Drukpadam

ఖమేని మృతి.. అన్ని రాష్ట్రాలను హైఅలర్ట్ చేసిన కేంద్రం

Ram Narayana