Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెట్రో ధరలపై కాంగ్రెస్ రాష్ట్రవ్యాపిత నిరసన … నిర్మల్ లో రేవంత్ ఖమ్మం లో భట్టి…

పెట్రో ధరలపై కాంగ్రెస్ రాష్ట్రవ్యాపిత నిరసన … నిర్మల్ లో రేవంత్ ఖమ్మం లో భట్టి
-తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున‌ ధ‌ర్నా.. ఎడ్లబండ్ల‌పై నిరసన ర్యాలీలు
-దేశంలో పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుద‌ల‌పై నిర‌స‌న‌
-ప‌లువురు నేత‌ల అరెస్టు…విడుదల
-ఇందిరా పార్క్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
-కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి…
-మెదక్ లో ఎడ్లబండి నుంచి కిందపడిన రాజనర్సింహ
-ఓ ఎడ్లబండిపై ప్రసంగం.. బెదిరిన ఎడ్లు

పెరుగుతున్న పెట్రో ,డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాపితంగా ఒక సమస్యపై కాంగ్రెస్ స్పందించడం అరుదుగా జరిగేది. కొత్త పీసీసీ వచ్చిన తరువాత జరిగిన మొదటి ఆందోళన కావడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్మల్ లో పాల్గొనగా , ఖమ్మం లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

హైద్రాబాద్ లో …. పొన్నాల ,అంజాన్ కుమార్ యాదవ్

దేశంలో పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతోన్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర‌స‌న తెల‌ప‌డానికి పీసీసీ కొత్త‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఎడ్లబండి మీద వచ్చారు. అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించడంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఈ సందర్భంగా పలువురు ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఇందిరా పార్క్‌, ధర్నా చౌక్‌ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత రావు, ఇతర మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌తో పాటు రాములు నాయ‌క్, ఫిరోజ్ ఖాన్ ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు కూడా హైద‌రాబాద్‌లో మరోచోట నిర‌స‌న‌లో పాల్గొన్నారు.

వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. నిర్మ‌ల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏలేటి మహేశ్వర్ రెడ్డితో క‌లిసి పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోనూ పెట్రోల్ ధ‌ర‌ల పెంపున‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఆందోళ‌న‌కు దిగింది. ఎడ్ల‌బండ్ల‌తో పాటు సైకిళ్లతో కాంగ్రెస్ నేత‌లు ర్యాలీ నిర్వ‌హించారు.

పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సైకిల్, బండి ర్యాలీలు నిర్వ‌హించారు. ఈ నిర‌స‌న‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఎడ్లబండ్లు ఎక్కి అక్క‌డి కాంగ్రెస్ నేత‌లు నిరస‌న తెలిపారు.

మెదక్ నిరసనలో అపశృతి ఎడ్ల బండిపై నుంచి కిందపడిన రాజనరసింహ …

దేశంలో చమురు ధరలు పెంచడంపై నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మెదక్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నాచౌక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అయితే, ఈ నిరసన కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు.

ఖమ్మం నిరసనలో ఎడ్లబండిపై పాల్గొన్న భట్టి ….

టీపీసీసీ పిలుపు మేరకు ఈ రోజు ఖమ్మం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవనం నుండి ధర్నా చౌక్ వరకు మోడీ ప్రభుత్వం పెంచిన డిజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో యడ్ల బండి పై ప్రదర్శన, సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకాన్ని నడ్డి విరిసేలా, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచిందని ,దీనివల్ల మార్కెట్ లోని అన్ని ఉత్పత్తులపై ప్రభావం పడి ఇతర వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయని, రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు ఇలాగే పెరిగితే సామాన్య ప్రజానీకం యడ్ల బండ్లు , సైకిల్ లపై తిరగాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్ , మాజీ ఎంఎల్సీ పోట్ల నాగేశ్వరరావు , టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా౹౹మద్ది శ్రీనివాసరెడ్డి , కళ్లెం వెంకటరెడ్డి , మామిడి వెంకన్న , దొబ్బల సౌజన్య , చంద్రిక , బొడ్డు బొందయ్య , కందుల గురునాదం , మధిర, ఖమ్మం , పాలేరు , వైరా నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూరాబాద్ నియోజకవర్గ పీసీసీ ఇన్‌చార్జిగా దామోదర రాజనర్సింహ…

Drukpadam

ఇకపై ఏ పార్టీలో చేరను: యశ్వంత్ సిన్హా!

Drukpadam

హైద్రాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ యస్ కు షాక్ …..

Drukpadam

Leave a Comment