డీలిమిటేషన్ లో తెలంగాణలో పెరుగన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు…
2028 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ, 2029 ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏర్పాటు చేసిన ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం…
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల నుండి 34 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఇవి 153 నుండి 175 వరకు కూడా పెరిగే వీలుంది.
అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం పార్లమెంట్ స్థానాలు 17 ఉండగా మరో 6 స్థానాలు పెరగడంతో వాటి సంఖ్య 23 కు చేరుకుంటుంది. ఇవి 25 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రోడ్డు మ్యాప్ కూడా సిద్ధం అయింది.వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు 33% మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించవలసి ఉంటుంది.
2026 జనాభాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు తప్పకుండా పెంచవలసి ఉంది. దీనికీతోడు ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ అసెంబ్లీ సీట్లు తప్పకుండా పెంచవలసి ఉంది. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ పూర్తయితే దేశవ్యాప్తంగా ఎంపీ (లోక్సభ), ఎమ్మెల్యే (అసెంబ్లీ) సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియ 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల (Census) ఆధారంగా చేపట్టాల్సి ఉంది.
కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు