Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దీదీ కొత్త ఎత్తుగడ …టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా ఎంపిక!

దీదీ కొత్త ఎత్తుగడ …టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా ఎంపిక!
-ఢిల్లీ నుంచి చక్రం తిప్పనున్న దీదీ
-నేడు ఢిల్లీలో పర్యటించనున్న మమత
-ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలతో భేటీ
-బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే యత్నం
-బెంగాల్ అధికారపార్టీలో అనూహ్య మార్పులు జరిగే అవకాశం
-అధికార పగ్గాలు అభిషేక్ బెనర్జీ కి దక్కేనా ?

కేంద్రాన్ని ఢీకొట్టగలిగే దమ్ము ,దైర్యం, సత్తా ఉన్న నాయకురాలుగా పేరున్న మమతా బెనర్జీ కేంద్ర రాజాకీలలోకి వెళ్లనున్నారా? … అందుకే ఆమె అనూహ్యంగా కొత్త ఎత్తుగడ వేశారా ? టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా ఎన్నికయ్యారా? బెంగాల్ అధికారపార్టీలో అనూహ్య మార్పులు జరగనున్నాయా? తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ పగ్గాలు చేపట్ట నున్నారా ? అంటే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు. రాజకీయ పండితులు …ఇటీవల కాలంలో బీజేపీకి ప్రత్యాన్మాయం కోసం కసరత్తు జరుగుతుంది. అందులో భాగంగా ఎన్నిక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్షాలను ఏకంచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. రాజకీయ కురువృద్ధుడు గా పేరున్న ఎన్సీపీ నేత శరద్ పవర్ తో అనేక మార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక కావడం జాతీయరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మమత బెనర్జీ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. అంతకు ఒక్క రోజు ముందు అంటే నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు ఆమెను పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఈ పరిణామంతో ఆమె ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోతున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. టీఎంసీకి లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. మమత ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలు కానప్పటికీ టీఎంసీ పీపీ చైర్‌పర్సన్‌గా ఎన్నికకు అర్హులేనని పార్టీ వర్గాలు తెలిపాయి.

మమత ఏడుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకున్న సుదీర్ఘ అనుభవాన్ని అసెంబ్లీతోపాటు, పార్లమెంటులోనూ వినియోగించుకోవాలని పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తెలిపారు. పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్‌గా ఆమె తమకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

నేడు హస్తినలో పర్యటించనున్న మమత వివిధ పార్టీల నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ భేటీ అవుతారు. కాగా, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని మమత ప్రయత్నిస్తున్నారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకుని బీజేపీయేతర పక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలని మమత ఇటీవల పిలుపునిచ్చారు.

Related posts

ఐరాసలో మరోసారి భారత్ కు మద్దతుగా నిలిచిన రష్యా!

Drukpadam

ఎంపీగా వద్దిరాజు రాజు రవిచంద్ర ఈనెల 30 న ప్రమాణస్వీకారం !

Drukpadam

ప్రత్యేక హోదా పై టీడీపీ ,వైసీపీ పరస్పర విమర్శలు!

Drukpadam

Leave a Comment