Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ లో సామ, దాన, భేద, దండోపాయాలు!

హుజురాబాద్ లో సామ, దాన, భేద, దండోపాయాలు
ఈటలకు షాక్.. మళ్లీ కారెక్కనున్న కోటి దంపతులు,
ఫలించిన మంత్రి రాయబారం
తాము టీఆర్ యస్ పార్టీ లోనే ఉంటామని ప్రకటన
బంధుత్వం తో దెబ్బగొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు
ఈటల రాజేందర్‌కు షాకిచ్చిన అనుచరుడు
భార్యతో కలిసి మళ్లీ టీఆర్ఎస్‌లో చేరిక
ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసిన దంపతులు

హుజురాబాద్‌లో తన బలాన్ని పెంచుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయలతో ఆపరేషన్ మొదలు పెట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఈటలకు భారీ షాకిచ్చింది. ఈటలకు మద్దతు ప్రకటిస్తూ టీఆర్ఎస్‌ని వీడిన జమ్మికుంట మున్సిపల్ వైస్ ఛైర్మన్ దేశిని స్వప్న, ఆమె భర్త, ఇల్లందకుంట రామాలయ మాజీ ఛైర్మన్ కోటి తిరిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వారు భారతీయ జనతా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తాము కారు గుర్తుపైనే గెలిచామని, ఇకపై టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని ఆ దంపతులు ప్రకటించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.

మంత్రి రాయభారం‌తోనే?

దేశిని స్వప్న, కోటి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ సోదరి, కోటి సోదరి కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకునే ఇటీవల హుజురాబాద్‌లో పర్యటించిన మంత్రి.. కోటి, స్వప్న దంపతులతో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తాము ఈటల వెంటే ఉంటామని వారు స్పష్టం చేసినా.. బంధువర్గం ద్వారా ఒత్తిడి చేయడంతో కోటి దంపతులు తిరిగి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Related posts

రాష్ట్రం పేరు మార్పు, కరోనా వ్యాక్సిన్ లపై ప్రధానితో మాట్లాడాను: మమతా బెనర్జీ!

Drukpadam

తప్పుడు హామీలిచ్చేవారిని, షార్ట్ కట్ రాజకీయాలు చేసేవారిని నమ్మొద్దు: మోదీ!

Drukpadam

ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ పై షర్మిల నిప్పులు

Drukpadam

Leave a Comment