Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కచ్చితమైన జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి టీటీడీకి ప్రశంసాపత్రం!

కచ్చితమైన జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి టీటీడీకి ప్రశంసాపత్రం!
-దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లు
-కచ్చితంగా చెల్లింపులు చేసే సంస్థలకు సన్మానం
-క్రమం తప్పకుండా చెల్లిస్తున్న టీటీడీ
-11 రాష్ట్రాల్లో టీటీడీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్

దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టి నాలుగేళ్లయిన సందర్భంగా జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్న వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ జాబితాలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ఉంది. ఈ క్రమంలో టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. సకాలంలో జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం ఈ మేరకు అభినందించింది. 2021 మార్చి 31 వరకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకు గాను టీటీడీకి ఈ ప్రశంసాపత్రం ఇచ్చారు.

దేశంలోని 11 రాష్ట్రాల్లో లావాదేవీల నిమిత్తం టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. అందులో, రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి ఈ ప్రశంసాపత్రం అందింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి.

Related posts

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత:మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!

Drukpadam

మునుగోడు ఉప ఎన్నికలో గద్వాల ఏఎస్పీ రాములు నాయక్ పై వేటు!

Drukpadam

శ్రీలంకలో భారీ బందోబస్తు మధ్య తెరుచుకున్న దుకాణాలు!

Drukpadam

Leave a Comment