జాతీయ వార్తలు

భర్త పకోడీలు తెచ్చేలోపే… బస్టాండ్‌లో భార్య మాయం!

ఆకలేస్తోందని భార్య అడిగింది. పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి భర్త పకోడీలు తీసుకొచ్చాడు. కానీ, తిరిగి వచ్చి చూసేసరికి ఆమె కనిపించలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ఘటన పోలీసుల వరకు వెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
యూపీలోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్‌కు, రాంపూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల రిమ్‌ఝిమ్‌తో గతేడాది డిసెంబర్ 1న వివాహం జరిగింది. హోలీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లిన రిమ్‌ఝిమ్‌ను, పండుగ ముగిశాక ఈ నెల 9న ప్రీతమ్ తిరిగి తన ఇంటికి తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో మరో బస్సు కోసం మొరాదాబాద్ జిల్లాలోని బిలారీ బస్టాండ్‌లో వారు వేచి ఉన్నారు.

ఆ సమయంలో ఆకలిగా ఉందని, వేడివేడి పకోడీలు తీసుకురమ్మని రిమ్‌ఝిమ్ భర్తను కోరింది. దీంతో ప్రీతమ్ పక్కనే ఉన్న బండి వద్దకు వెళ్లాడు. కొద్ది నిమిషాల్లోనే పకోడీలు తీసుకుని తిరిగి రాగా, భార్య కనిపించకపోవడంతో షాక్ అయ్యాడు. చుట్టుపక్కల వెతికినా, స్థానికులను అడిగినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళనకు గురైన ప్రీతమ్, వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

తన భార్య.. ఆమె పుట్టింటి గ్రామమైన ఓ యువకుడితో వెళ్లిపోయి ఉండొచ్చని భర్త ప్రీతమ్ పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్‌ను కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై ద‌ర్యాప్తు కొనసాగుతోంది.

Related posts

తెరుచుకున్న శబరిమల ఆలయం..

Ram Narayana

 మలేసియా వెళ్లినట్లు మూడేళ్ల నాటకం.. కన్నవారిని మోసం చేసి ప్రాణాలు తీసుకున్న యువతి

Ram Narayana

పీఓకేను గురుదక్షిణగా ఇవ్వండి: ఆర్మీ చీఫ్‌ను కోరిన జగద్గురు రాంభద్రాచార్య

Ram Narayana