రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిని రక్తం కక్కుకుని యువకుడి మృతి
-నర్సంపేట పట్టణంలో ఘటన!
-రెస్టారెంట్లో శాంపిల్స్ సేకరించిన అధికారులు
-యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
రెస్టారెంట్లలో ఫుడ్ పై రకరకాల చర్చ జరుగుతూనే ఉంది . ఒక మాంసం బాధలు మరో మాంసం పెడతారని , రోజుల తరబడి నిల్వ ఉండే మాంసం వాడుతారని అనేక హోటల్స్ పై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక హోటల్ లో చికెన్ బిర్యానీ తిన్న వ్యక్తి వాంతులు ,విరోచనాలతో రక్తం కక్కుకొని చావడం మొదటి సరిగా వింటున్నాం , ఇదే ఎక్కడో ఏరే దేశంలో జరగలేదు , వేరే రాష్ట్రంలో కూడా కాదు . వరంగల్ రురల్ జిల్లాలోని చిన్నారావు పేట మండలం లో జరిగింది ఈ ఘటన … దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ ఆహార నిరోధక శాఖ వారు కూడా దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.
ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిన్న యువకుడు ఆ వెంటనే రక్తం కక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటు చేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండా వాసి ప్రసాద్(23) ఓ రెస్టారెంట్కు వెళ్లాడు. తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తిన్నాడు.
అయితే, రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అతనికి వాంతులు వచ్చాయి. రక్తం కూడా నోట్లో నుంచి పడడంతో ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే ప్రసాద్ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్కుతీసుకెళ్లగా అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మునిసిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్కడి ఫుడ్ శాంపిల్స్ను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.