Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వంగవీటి రాధా వైసీపీలో చేరనున్నారా ?

వంగవీటి రాధా వైసీపీలో చేరనున్నారా ?

-కొడాలి నాని తో రహస్య మంతనాల మర్మమేమిటి ??
-మంత్రి కొడాలి నానితో వంగవీటి రాధా చెట్టపట్టాలు
-విజయవాడలో కొడాలి నాని ఫంక్షన్ హాల్లో కార్యక్రమం
-హాజరైన వంగవీటి రాధా
-ఆత్మీయంగా పలకరించిన నాని
-ఇద్దరి మధ్య చర్చ

వంగవీటి రాధా వైసీపీ లో చేరనున్నారా ? అంతే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు .మంత్రి కొడాలి నాని ,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా,లు మంచి స్నేహితులు వారి మద్యం స్నేహం చెడిపోయిందని ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో ఒక ఫంక్షన్ లో వారి కలయిక జరుగుతున్న ప్రచారాన్ని పటాపంచలు చేసింది.

టీడీపీ నేత వంగవీటి రాధా ఏపీ మంత్రి కొడాలి నానితో ఓ కార్యక్రమంలో సన్నిహితంగా మెలగడం ఆసక్తి కలిగిస్తోంది. టీడీపీకి బద్ధశత్రువు లాంటి కొడాలి నానితో వంగవీటి రాధా విజయవాడలో సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి వంగవీటి రాధా కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని… రాధాను ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఫంక్షన్ హాల్లోని ఓ గదిలో కాసేపు చర్చలు జరిపిన వీరిద్దరూ వేదిక వరకు కలిసే వచ్చారు.

ఈ కలయిక పలు ఊహాగానాలకు దారితీసింది. వంగవీటి రాధా వైసీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారా? అనే కోణంలో ప్రచారానికి తెరలేచింది. కాగా వచ్చే ఎన్నికల్లో రాధా గుడివాడ బరిలో దిగుతారని, మంత్రి కొడాలి నానిపై పోటీ చేస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, నిన్న జరిగిన పరిణామంతో కొత్త చర్చ మొదలైంది.

2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీ లో ఉన్న వంగవీటి రాధా అనూహ్యంగా టీడీపీ లో చేరారు. ఒకవేళ వైసీపీ లో పొసగకపోతే వంగవీటి రాధా జనసేన పార్టీ లో చేరతారని అందరు భావించారు. కాని అందుకు విరుద్ధంగా తన కుటుంబానికి బద్ద శత్రువైన టీడీపీ లో చేరడం ఆయన అనుయాయులకు సైతం రుచించలేదు. అయినప్పటికి ఆయన అందులో చేరిన అంట సంతృప్తిగా లేరు . వైసీపీ అధికారంలోకి రావడం ,వంగవీటి రాధా టీడీపీ లో ఉండటంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు . ఇటీవల కాలంలో మంత్రి కొడాలి నాని తో ఉన్న స్నేహం చెడిందని అందువల్ల రాధను ఈసారి ఎన్నికల్లో గుడివాడ నుంచి అభ్యర్థిగా పోటీ చేయించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని అందువల్ల ప్రాణ స్నేహితులుగా ఉన్న నాని ,రాధాలు శత్రులు కావడం ఖాయమని కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఒక ఫంక్షన్ లో కలిసిన ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడపడం , ఇద్దరు రహస్యంగా మాట్లాడుకోవడం తో కొత్త ప్రచారం ప్రారంభం అయింది. వంగవీటి రాధా వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో సీఎం జగన్ దగ్గరకు తాను తీసుకెళతానని ,ఎమ్మెల్సీ కూడా ఇప్పిస్తానని నాని రాధకు అభయం ఇచ్చారని అందువల్ల రాధా వైసీపీ లో చేరడం ఇక లాంఛనమే అనే ప్రచారం జరుగుతుంది.

Related posts

కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు…

Drukpadam

యాదవులను క్షమాపణలు కోరిన సీపీఐ నారాయణ!

Drukpadam

ఖమ్మం జిల్లాలో పొంగులేటి దూకుడు …కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం..!

Drukpadam

Leave a Comment