Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆకాశం నుంచి పడిన అరుదైన రాయి… తహసీల్దార్ కు అప్పగించిన రైతు!

ఆకాశం నుంచి పడిన అరుదైన రాయి… తహసీల్దార్ కు అప్పగించిన రైతు!
-మహారాష్ట్రలో ఘటన
-వర్షంతో పాటు పొలంలో పడిన రాయి
-వెండి, బంగారు వర్ణంలో మెరుస్తున్న రాయి
-స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
-పరిశోధనలు చేస్తున్న జీఎస్ఐ

మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఉస్మానాబాద్ జిల్లా వసీలో ఆకాశం నుంచి ఓ అరుదైన రాయి కిందపడింది. ప్రభు అనే రైతు తన పొలంలో ఉండగా, పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షంతో పాటే రాయి కూడా పొలంలో పడింది. వెండి, బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ రాయి ఆకాశం నుంచి పెద్ద శబ్దంతో పడడం ఆ రైతును విస్మయానికి గురిచేసింది. దాంతో ఆ రాయి వంటి పదార్థం గురించి స్థానిక తహసీల్దార్ కు సమాచారం అందించారు.

ఆ రాయిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వారికి అప్పగించారు. ఇది ఎంతో అరుదైన రాయి అయ్యుంటుందని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండున్నర కేజీల బరువున్న ఆ రాయిపై జీఎస్ఐ పరిశోధనలో మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

Related posts

సవాంగ్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది…ఉద్యోగుల ర్యాలీ కారణమా ? పవన్ కళ్యాణ్ !

Drukpadam

ఎమ్మెల్యే మైనంపల్లి ఇంటివద్ద ఉద్రిక్తత.. కోడిగుడ్లతో దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం!

Drukpadam

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారె ప్రసక్తే లేదు … టీఆర్ యస్ ఎంపీ నామ!

Drukpadam

Leave a Comment