Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈవీఎం లను తరలించే బస్సు లను టీఆర్ యస్ హోటల్ నేత దగ్గర ఆపారు …బీజేపీ నేత డీకే అరుణ ఫిర్యాదు …

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ వీవీ ప్యాట్లు త‌ర‌లించే బ‌స్సుల‌ను టీఆర్ఎస్ నేత హోట‌ల్ వ‌ద్ద ఆపారు: డీకే అరుణ ఫిర్యాదు

  • -వీవీ ప్యాట్ల‌ త‌ర‌లింపుల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు
  • -ప్రైవేటు కారులోనూ వీవీ ప్యాట్ల‌ను త‌ర‌లించారు
  • -ఓ బ‌స్సులోని వీవీ ప్యాట్ బాక్సును కారులో పెట్టారు
  • -భ‌ద్ర‌త లేకుండా ఈవీఎంల‌ను ఎందుకు త‌ర‌లించారు?

నిన్న తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, అనంత‌రం వీవీ ప్యాట త‌ర‌లింపుల ప్ర‌క్రియ స‌మ‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ అధికారులకు బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ నాయ‌కురాలు డీకే అరుణ్ మీడియాతో మాట్లాడుతూ… ప్రైవేటు కారులోనూ వీవీ ప్యాట్ల‌ను త‌ర‌లించార‌ని తెలిపారు.

అలాగే, వీవీ ప్యాట్లు త‌ర‌లించే బ‌స్సుల‌ను టీఆర్ఎస్ నేత హోట‌ల్ వద్ద ఆపారని ఆమె అన్నారు. ఓ బ‌స్సులోని వీవీ ప్యాట్ బాక్సును కారులో పెట్టార‌ని ఆరోపించారు. అలాగే, భ‌ద్ర‌త లేకుండా ఈవీఎంల‌ను ఎందుకు త‌ర‌లించార‌ని ఆమె నిల‌దీశారు. ఎన్నిక వేళ అధికారులు కూడా ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని తాము అధికారుల‌ను కోరామ‌ని వివ‌రించారు.

 

పోలింగ్ సిబ్బందికీ డబ్బులిచ్చారు.. బస్సులో ఈవీఎంల మార్పులపై ఈటల మండిపాటు

  • తనను ఓడించేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలూ చేశారని ఆరోపణ
  • బస్సుల్లో ఈవీఎం మార్పుపై ఫిర్యాదు చేస్తామని కామెంట్
  • అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం
Eatala Fires On CM KCR
హుజూరాబాద్ లో ఉప ఎన్నికల నిర్వహణ పట్ల బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. బస్సుల్లో కూడా ఈవీఎంలను మారుస్తున్నారన్న వార్తలు వస్తున్నాయని, అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలూ చేశారని, పోలింగ్ సిబ్బందికీ డబ్బులిచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. స్వయంగా ఎమ్మెల్యేలే డబ్బులు పంచి వెళ్లారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు.

అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఈటల ఆరోపించారు. బస్సుల్లో ఈవీఎంల మార్పుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పొరపాటు జరిగిందని కలెక్టర్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యం ఎలా చూపిస్తారన్నారు. దీనిపై కలెక్టర్, సీపీల తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలిచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీకి నిన్న గులాంనబీ ఆజాద్ ,నేడు ఎంఏ ఖాన్ రాజీనామా!

Drukpadam

వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ…

Drukpadam

మాజీ సీఎం యడియూరప్పకు బీజేపీ షాక్..

Drukpadam

Leave a Comment