Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆకాశంలో మిస్టరీ కాంతులు… పంజాబ్ లో అంతుచిక్కని ఘటన…

ఆకాశంలో మిస్టరీ కాంతులుపంజాబ్ లో అంతుచిక్కన ఘటన

  • పఠాన్ కోట్ వద్ద ఆకాశంలో కనిపించిన లైట్లు
  • వరుసలో ఉన్న లైట్లు
  • దాదాపు 5 నిమిషాల పాటు దర్శనం
  • మిస్టరీగా మారిన వైనం

పంజాబ్ లో అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంది. పఠాన్ కోట్ లో ఈ సాయంత్రం చీకట్లు కమ్మే సమయంలో ఆకాశంలో వింత కాంతులు దర్శనమిచ్చాయి. ఆ లైట్లు ఏమిటో అర్థం కాక ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. ఆకాశంలో ఓ వరుసలో కనిపించిన లైట్లు ఏమిటో అటు అధికారులకు కూడా అంతుబట్టలేదు. సాయంత్రం 6.50 నిమిషాలకు ఈ లైట్లు కనిపించాయి. దాదాపు 5 నిమిషాల పాటు కనిపించాయని స్థానికులు వెల్లడించారు.

ఇదే తరహాలో ఈ ఏడాది జూన్ లో గుజరాత్ లోని జునాగఢ్ లోనూ వినువీధిలో మిస్టరీ లైట్లు కనిపించాయి. అవి గ్రహాంతరజీవుల వాహనాలుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారు నరోత్తమ్ సాహూ ఆ ప్రచారంపై స్పందిస్తూ… కొన్ని ఉపగ్రహాలు అత్యంత తక్కువ ఎత్తులో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు ఆ విధంగా కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తాజాగా, పంజాబ్ లోని పఠాన్ కోట్ లో కనిపించిన లైట్ల అంశం మాత్రం మిస్టరీగా మారింది.

Related posts

9వ రౌండ్ ఫలితాల వెల్లడి: మళ్లీ ఈటలే ముందంజ.. భారీ మెజారిటీ

Drukpadam

హిందువులకు మైనార్టీ హోదా రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయన్న పిటిషనర్ …గట్టి ఆధారాలు చూపాలన్న సుప్రీం!

Drukpadam

అమరావతిపై ద్యేషం లేదు …విశాఖ పై ప్రేమలేదు… :ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్…

Drukpadam

Leave a Comment