Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ విజేత పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఖమ్మం-నల్గొండ-వరంగల్ స్థానంలో పల్లా విజయం
  • ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ కు విచ్చేసిన పల్లా
  • పల్లాకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్
  • పల్లా విజయానికి కృషి చేశారంటూ ఎర్రబెల్లికి ప్రశంసలు
Palla Rajeswar Reddy met CM KCR after wins MLC elections

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఈ క్రమంలో పల్లా ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ అర్బన్, రూరల్ నేతలు కూడా ఉన్నారు.

తనను కలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఎమ్మెల్సీగా మెరుగైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా విజయానికి కృషి చేశారంటూ మంత్రి ఎర్రబెల్లిని కూడా సీఎం కేసీఆర్ ప్రశంసించారు.

Related posts

మోడీకి జగన్ దత్తపుత్రుడు అందుకే కోర్టుకు వెళ్లకుండా చేశారు …హర్షకుమార్

Drukpadam

తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ కు చుక్కెదురు …ఉస్మానియా యూనివర్శిటీ కి రాహుల్ కు నో పర్మిషన్…

Drukpadam

భార‌త 15 రాష్ట్రప‌తిగా ద్రౌప‌ది ముర్ము….

Drukpadam

Leave a Comment