Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బీజేపీ నేత జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో న‌లుగురి కిడ్నాప్‌!

బీజేపీ నేత జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో న‌లుగురి కిడ్నాప్‌

  • ఢిల్లీ సౌత్ ఎవెన్యూలో నివాసం ఉంటున్న జితేంద‌ర్‌రెడ్డి
  • జితేంద‌ర్ రెడ్డి డ్రైవ‌ర్ స‌హా న‌లుగురి కిడ్నాప్‌
  • సౌత్ ఎవెన్యూ పోలీసుల‌కు ఫిర్యాదు, కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో ఏకంగా న‌లుగురు వ్య‌క్తులు కిడ్నాప్‌కు గుర‌య్యార‌న్న వార్త క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీలోని జితేంద‌ర్ రెడ్డి నివాసంలో చోటుచేసుకుంది. కిడ్నాప్‌పై జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు స‌ద‌రు ఫిర్యాదును ప‌రిశీల‌న‌లో పెట్టార‌ట‌.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని నెంః105 ఇంటిలో జితేంద‌ర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆ ఇంటి ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశించి జితేంద‌ర్ రెడ్డి కారు డ్రైవ‌ర్ స‌హా న‌లుగురు వ్య‌క్తులను బ‌ల‌వంతంగా లాక్కెళ్లార‌ట‌. ఈ హ‌ఠాత్ప‌రిణామం నుంచి తేరుకున్న జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది పోలీసుల‌ను కోరార‌ట‌.

Related posts

పెళ్లయి కొన్ని నెలలే… విగతజీవులుగా హైదరాబాదీ డాక్టర్ దంపతులు!

Drukpadam

బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో సినీ నటి హేమ అరెస్ట్…!

Ram Narayana

రఘురామ అరెస్ట్ తీరు, తదనంతర పరిణామాలపై ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు…

Drukpadam

Leave a Comment