అంతర్జాతీయం

దాడిలో ఖమేనీ వెంటనే చనిపోలేదు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత!

  • అమెరికా-ఇజ్రాయెల్ దాడిలోనే ఇరాన్ నేత ఖమేనీ మరణం
  • దాడి జరిగిన మరుసటి రోజు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన వైనం
  • ఇరాన్ నూతన అధినేతగా కుమారుడు ముజ్తబా ఖమేనీ
  • ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరిక

ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో ఆయన వెంటనే మరణించలేదని, తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూశారని ఆయన సన్నిహిత అనుచరుడు అబ్దుల్ మజిద్ హకీమ్ ఎలాహి వెల్లడించారు. ఈ ప్రకటనతో ఖమేనీ మరణంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.

దాడి సమయంలో ఖమేనీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందని, ఆయన కుమార్తె, అల్లుడు అక్కడికక్కడే మరణించారని మజిద్ తెలిపారు. “దాడి తర్వాత ఖమేనీని వెంటనే ఆసుపత్రికి తరలించాం. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన మరుసటి రోజు తుదిశ్వాస విడిచారు” అని మజిద్ వివరించారు.

ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీని నూతన సుప్రీం లీడర్‌గా ఎంపిక చేశారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఒత్తిడితో ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 36 ఏళ్లుగా ఇరాన్‌ను పాలిస్తున్న 86 ఏళ్ల ఖమేనీ మృతితో దేశంలో 40 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను స్వస్థలమైన మషద్ నగరంలో నిర్వహించనున్నారు.

తమ నేత మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇరాన్ సైన్యం హెచ్చరించింది. మరోవైపు, ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందని, ఇక చర్చలకు సమయం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

Related posts

అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించనున్న ఇస్రో!

Ram Narayana

భారత నౌకలను నిషేధించిన పాకిస్థాన్..!

Ram Narayana

ఇమ్రాన్ ఖాన్ హత్యకు వాళ్లిద్దరూ కుట్ర పన్నుతున్నారు: తోబుట్టువుల సంచలన ఆరోపణ

Ram Narayana