Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటకాభివృద్ధి సూచీలో పతనమైన భారత్ స్థానం!

అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటకాభివృద్ధి సూచీలో పతనమైన భారత్ స్థానం!
తాజా సూచీ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం
54వ స్థానంలో నిలిచిన భారత్
2019లో భారత్ ర్యాంకు 46
ఈసారి అగ్రస్థానంలో జపాన్
టాప్-5లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ

భారత్ లో పర్యాటకుల సంఖ్య తగ్గింది…. ప్రపంచవ్యాపితంగా ఈసమస్య ఉన్నా భారత్ గత మూడు సంత్సరాల క్రితం పోల్చితే 8 స్థానాలు పడిపోవడం ఆందోళనకర విషయం . కరోనా ఒక కారణంగా చెపుతున్నప్పటికీ దేశంలో శాంతి భద్రతలు పురాతన సంపదపట్ల మనం చూపుతున్న వైఖరి కూడా కారణమై ఉండవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల హేరిటేజ్ సంపదను కాపాడు కోవచ్చునని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు .

వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా అంతర్జాతీయ ప్రయాణాలు, టూరిజం అభివృద్ధి సూచీని విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ కు 54వ స్థానం దక్కింది. మూడేళ్ల కిందటితో పోల్చితే భారత్ 8 స్థానాలు పతనమైంది. భారత్ 2019లో 46వ స్థానంలో ఉంది. ఈ సూచీని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండేళ్లకోసారి రూపొందిస్తుంది.

 

ఈ జాబితా కోసం 117 దేశాల ఆర్థిక, ప్రయాణ, పర్యాటక పరిస్థితులను ప్రామాణికంగా తీసుకున్నారు. ఆయా దేశాల్లో ఆరోగ్య పరిస్థితులు, మౌలిక వసతులు, భద్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ తాజా సూచీలో జపాన్ నెంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో స్పెయిన్, నాలుగో స్థానంలో ఫ్రాన్స్, ఐదో స్థానంలో జర్మనీ ఉన్నాయి.

Related posts

కొత్త సంవత్సరం రోజున కేటీఆర్ ను బాధ పెట్టవద్దు..

Ram Narayana

భట్టి ఆరోపణలపై మంత్రి పువ్వాడ మండిపాటు

Drukpadam

ఫైబర్ నెట్ నుంచి 410 మంది వైసీపీ నేతల సహాయకులు, డ్రైవర్ల తొలగింపు!

Ram Narayana

Leave a Comment