ఆంధ్రప్రదేశ్

క్లాస్ రూమ్ లో విద్యార్థినులతో చిందులేసిన టీచర్!

క్లాస్ రూమ్ లో విద్యార్థినులతో చిందులేసిన టీచర్!

  • ఢిల్లీ ప్రభుత్వ టీచర్ సరదా చర్య
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • తరగతి గదిలో జుమ్కా బరేలి వాలా పాటకు చక్కని నృత్యం
పాప్యులర్ సాంగ్ ‘జుమ్కా బరేలి వాలా’ తెలిసే ఉంటుంది. ఓ ప్రైవేటు ఆల్బమ్ లోని ఈ పాటకు ఓ టీచర్, తన విద్యార్థినులతో కలసి తరగతి గదిలోనే అందంగా స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. విద్యార్థులు కొద్దిగా తడబడినా.. టీచర్ మాత్రం స్టెప్పుల్లో లయ తప్పలేదు. దీన్ని ఇప్పటికే 5.69 లక్షల మంది చూసేశారు.
కొంత సాధన చేసినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు క్రమబద్ధంగా, లయబద్దంగా స్టెప్పులు వేశారు. టీచర్ కూడా వారిలో ఒకరిగా మారిపోయారు. దీన్ని వీడియో తీయించారు. టీచర్ మను గులాటి స్వయంగా తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘వేసవి శిబిరం చివరి రోజున మా అసంపూర్ణ నృత్యం. ఆనందం, కలయిక తోడైతే కొన్ని కచ్చితమైన స్టెప్పులకు దారితీస్తుంది’’ అంటూ టీచర్ తన పేజీలో రాశారు.

ఢిల్లీ ప్రభుత్వ టీచర్ అయిన మను గులాటీ స్నేహంగా మెలగడం ద్వారా విద్యార్థుల మనసులను చూరగొనడమే కాదు.. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న వ్యక్తి. ఇందులో 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి అందుకున్న నేషనల్ టీచర్స్ అవార్డు కూడా ఉంది.

Related posts

ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, ప్రకటించిన రేవంత్ రెడ్డి

Ram Narayana

ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్… శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి

Ram Narayana

దాతృత్వం చాటిన ఖమ్మం జిల్లా సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే సతీమణి రుక్మిణమ్మ..

Drukpadam