Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

త్వరలో వరంగల్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు – ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

త్వరలో వరంగల్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు
– ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

గత కొంతకాలంగా గ్రేటర్ వరంగల్ జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల కోరికను త్వరలో తమ ప్రభుత్వం తీర్చబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
ఆదివారం నాడు హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) హన్మకొండ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ మీడియాతో ఫ్రెండ్లీ సంబంధాన్ని కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల వైద్య పథకాన్ని పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించడం జరిగిందని, రాబోవు రోజుల్లో మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుందని ఆయన తెలిపారు.

 

ఈ సభకు గౌరవ అతిథిగా హాజరైన టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ మాట్లాడుతూ, దాదాపు 65 యేండ్ల సుదీర్ఘ చరిత్ర, పోరాటాలు, త్యాగాల కలయికే టీయూ డబ్ల్యూజే(ఐజేయూ) అని స్పష్టం చేశారు.
జర్నలిస్టుల పక్షపాతిగా, గొంతుగా నిలబడి అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో నిర్వీరామంగా పోరాడుతున్న చరిత్ర ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలకు మాత్రమే ఉందన్నారు. అందుకే దేశంలో ఆయా రాష్ట్రాల జర్నలిస్టు సంఘాలు ఐజేయును, రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టులు టీయుడబ్ల్యుజెను ఆదరిస్తున్నారని విరాహత్ అన్నారు. దాదాపు13,800 సభ్యత్వాలతో అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ, 33 జిల్లాల్లో కమిటీలతో, కార్మిక శాఖ నియమ నిబంధనలకు కట్టుబడి రాష్ట్రంలో జర్నలిస్టులకు సేవలందిస్తున్న ఏకైక సంఘం టీయుడబ్ల్యుజె(ఐజేయూ)
మాత్రమేనన్నారు. ప్రభుత్వ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు జర్నలిస్టు సంఘాల పేరుతో దుకాణాలు పెట్టినా అవి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమేనని, జర్నలిస్టులు మాత్రం వారిని ట్రేడ్ యూనియన్ గా గుర్తించడం లేదని విరాహత్ తెలిపారు.
సభకు యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణకర్, రాష్ట్ర కార్యదర్శి గాడిపల్లి మధు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట రమణ, గడ్డం రాజిరెడ్డి, విద్యాసాగర్, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ కన్వీనర్ అయిలు రమేష్, హన్మకొండ జిల్లా కార్యదర్శి కంకణాల సంతోష్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచందర్ రావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

Drukpadam

ఢిల్లీలో ఏపీ సీఎం ప్రదక్షణలు …కనికరించారా ? కస్సుమన్నారా ??

Drukpadam

మరో 4 రోజుల్లో 800 కోట్లకు చేరుకోనున్న ప్రపంచ జనాభా..

Drukpadam

Leave a Comment