క్రైమ్ వార్తలు

జమ్ము కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం… 11 మంది మృతి

జమ్ము కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం… 11 మంది మృతి

  • పూంచ్ జిల్లాలో ఘటన
  • మండి నుంచి సాజియాన్ వెళుతున్న మినీ బస్సు
  • లోతైన లోయలోకి పడిపోయిన వైనం
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

జమ్మూ కశ్మీర్ లో ఓ మినీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పూంచ్ జిల్లాలో బస్సు లోయలో పడింది. ఆ సమయంలో బస్సు మండి నుంచి సాజియాన్ ప్రాంతానికి వస్తోంది. సాజియాన్ సమీపంలో ఓ లోతైన లోయలోకి బస్సు పడిపోవడంతో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. గాయపడిన వారిని మండిలోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కాగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Related posts

మంగళగిరిలో రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు!

Ram Narayana

‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో రూ.1.07 కోట్ల మోసం.. ఢిల్లీ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

Ram Narayana

ఢిల్లీ లిక్కర్ కేసు…శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించింది…రిమాండ్ రిపోర్ట్ లో సిబిఐ

Ram Narayana