Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం!

గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం!
మదర్ థెరీసా సెంటర్ లో గాన గంధర్వుడి విగ్రహం
అనుమతి లేదంటూ తొలగించిన అధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళాకారులు
తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

గుంటూరు లో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం తొలగింపు వివాదాస్పదమైంది ..గాన గంధర్వుడిగా పేరున్న ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు విషయంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేయడంపై కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు .అయితే కళాకారులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గుంటూరు లోనే ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేస్తే దాన్ని తొలగించడంపై మండిపడుతున్నారు .గుంటూరులో 200 పైగా అనుమతిలేని విగ్రహాలు ఉన్నాయని అయినప్పటికీ వాటి జోలికి వేళ్ళని అధికారులు గాన గంధర్వుడి విగ్రహం తొలగించడం విచిత్రంగా ఉందని అన్నారు .తిరిగి దాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు .

గుంటూరులో గతంలో కళా దర్బార్ సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించడం వివాదాస్పదమైంది. బాలు విగ్రహం తొలగింపు పట్ల కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కళా దర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు స్పందిస్తూ, మహాగాయకుడి విగ్రహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేసింది ఒక్క గుంటూరులోనే అని వెల్లడించారు. గుంటూరులో 200కి పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని, బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం

Drukpadam

రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలను కట్టడి చేయలేం: సుప్రీంకు ఈసీ నివేదన!

Drukpadam

గంభీర్ పైకి దూసుకెళ్లిన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..

Drukpadam

Leave a Comment