Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యండి …పీసీసీ చీఫ్ నేనే ఎంపీ వెంకటరెడ్డి లాజిక్ …!

కాంగ్రెస్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ ద్రోహం పై వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం …
-మునుగోడులో కాంగ్రెస్ ఓడితే నేనే పీసీసీ చీఫ్ :ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త లాజిక్
-మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకటరెడ్డి ఫోన్ -ద్వారా ప్రచారం పై విస్మయం …
-కోమటిరెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు
-గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం
గాంధీ భవన్ ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం …

మునుగోడు ఎన్నికలు కాంగ్రెస్ ను ముక్కలు చేస్తుందా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది.కాంగ్రెస్ కు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ లో చేరడంతో ఉపఎన్నిక జరుగుతుంది. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ కి రాజీనామా చేసి ఎన్నికలు తెచ్చిపెట్టారంటూ చర్యలను చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు . కోమటి రెడ్డి బ్రదర్స్ ఒకరు కాంగ్రెస్ లో ఉండగా మరొకరు బీజేపీ లో చేరడం తిరిగి పోటీచేయడం అనైతికమని అభిప్రాయాలూ ఉన్నాయి. ఇది అహంకార పూరితమైన వైఖరిని అంటున్నారు . కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తనతమ్ముడికి ఓటి వేయమని అడగటం ఆ ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. గాంధీ భవన్ ముందు వెంకట రెడ్డి దిష్టిబొమ్మ తగల బెట్టడం పై కూడా కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై వెంకటరెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా , రాజగోపాల్ రెడ్డి స్పందించారు ఇది తమపై జరుగుతన్న కుట్రపూరిత ప్రచారం అని కొట్టి పారేశారు .

మునుగోడు ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీచేస్తున్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని కాంగ్రెస్కు చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ల ద్వారా తన అనుయాయులకు చెప్పటం కాంగ్రెస్ లో కలకలానికి దారితీసింది. ఇది అనైతికమని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇప్పటివరకు కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే తమకు ఎంతో అభిమానం ఉండేదని కానీ నేటితో అది లేకుండా చేసుకున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతే తర్వాత పి సి సి ప్రెసిడెంట్ ను తానేనని ఆయన చెప్పుకోవడం విస్మయానికి గురిచేస్తుంది. మునుగోడు లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడం ద్వారా తాను పీసీసీ పగ్గాలు చేపడతానని పేర్కొనడంపై అన్ని వైపుల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే అభిమానించే వారు కూడా ఆయన చర్యలను జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటివరకు ఆయన తన తమ్ముడుబీజేపీ నుంచి పోటీలో ఉన్నందున అక్కడ ప్రచారం చేయలేకపోతున్నారని సరిపెట్టుకున్నవారు సైతం ఆయన ఫోన్ ద్వారా పార్టీలకు అతీతంగా తనతమ్ముడికి ఓటేయాలని చెప్పడంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆగ్రహంగా ఉంది. ఇప్పటివరకు ఆయన కప్పుకున్న ముసుగు తొలిగిందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కేవలం తమ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి బ్రదర్స్ బలిచేసేందుకు సిద్ధపడ్డారని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి .

ప్రచారానికి దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర విమర్శలు వస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఆయన నియోజకవర్గంలో తన తమ్ముడు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయలేకపోతున్నాడు అనేకమంది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్యలపై భగ్గుమంటున్నారు . ఇప్పటివరకు వారికీ ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసికున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Related posts

దళిత బందు కొత్త చిక్కులు …లబ్ది దారుల ఎంపికపై గరం గరం!

Drukpadam

కాపులు నన్ను కాపుగా గుర్తించడంలేదు పవన్ కల్యాణ్ ఆవేదన !

Drukpadam

టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్…

Drukpadam

Leave a Comment