ఆంధ్రప్రదేశ్

కోమటిరెడ్డిని సొంత అన్నగా భావించా.. ఆయన వైఖరి బాధిస్తోంది: పాల్వాయి స్రవంతి

  • మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి
  • కోమటిరెడ్డి చేసింది నమ్మక ద్రోహమేనన్న స్రవంతి
  • ప్రచారానికి రాని కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడి

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి… భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డిని తాను తన సొంత అన్నగా భావించానని, అయితే ఆయన తనకు నమ్మక ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి రావాలని ఆయనను వేడుకున్నానని కూడా స్రవంతి అన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి వైఖరి తనను తీవ్రంగా బాధిస్తోందని స్రవంతి అన్నారు. సొంత పార్టీ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ఆమె చెప్పారు. మునుగోడులో ఓ ఆడబిడ్డగా ఒంటరి పోరు సాగిస్తున్నానన్నారు. అయినప్పటికీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని స్రవంతి ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు… సీఎం చంద్రబాబు

Ram Narayana

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు!

Drukpadam

నేర్చుకోవడం ఆపితేనే వృద్ధాప్యం.. విద్యార్థులకు సుధా మూర్తి స్ఫూర్తిదాయక సందేశం…

Ram Narayana