Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాస్క్ చేతికి ట్విట్టర్ …ఊడి పోతున్న ఉద్యోగాలు!

మాస్క్ చేతికి ట్విట్టర్ …ఊడి పోతున్న ఉద్యోగాలు!
-ట్విట్టర్‌లో తీసివేతలు షురూ.. భారత్‌లో 180 మంది ఇంటికి!
-ట్విట్టర్‌‌ను టేకోవర్ చేస్తూనే ఉన్నతాధికారులను తొలగించిన మస్క్
-ప్రపంచవ్యాప్తంగా 7500 మంది ఉద్యోగులు
-ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయం
-ఇప్పటికే ఈ-మెయిల్స్ అందుకుంటున్న ఉద్యోగులు

ఎలాన్ మస్క్ అనుకున్నంత పనీ చేశారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేస్తూనే ఉన్నతాధికారులపై వేటేసిన మస్క్.. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని నిర్ణయించుకున్న మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉన్నపళంగా ఇంటికి పంపించేస్తున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దేశంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి ఉద్వాసన పలికినట్టు సమాచారం. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజినీరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, పాలసీ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఇలా తొలగించిన వారికి పరిహారం ఇస్తారా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇక, ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 మంది పనిచేస్తుండగా 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ ఇండియాలో ఉద్యోగుల తీసివేతలు మొదలైనట్టు ఓ ఉద్యోగి తెలిపాడు. తన సహచరుల్లో కొందరికి ఇప్పటికే ఈ-మెయిల్స్ రూపంలో తీసివేతలకు సంబంధించిన సమాచారం అందిందని పేర్కొన్నాడు. అయితే, ఇండియాలో తీసివేతలపై ట్విట్టర్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదు.

ఉద్యోగులకు గురువారం ఓ సందేశం పంపుతూ.. ఉద్యోగులతోపాటు ట్విట్టర్ సిస్టమ్స్, కస్టమర్ డేటా భద్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, ఒకవేళ మీరు ఆఫీసులో ఉన్నా, ఆఫీసుకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్నా దయచేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించింది. అది చూసిన ఉద్యోగులు మరింత ఆందోళనకు గురయ్యారు.

 

రోజుకు 40 లక్షల డాలర్ల నష్టపోతున్నాం: ట్విట్టర్ సీఈవో మస్క్

  • మరోమార్గం లేక ఉద్యోగాల్లో కోత విధింపు
  • ఉద్యోగం కోల్పోయిన వాళ్లను ఆదుకుంటామని వెల్లడి
  • మూడు నెలల పాటు సగం కన్నా ఎక్కువే జీతం చెల్లిస్తాం: మస్క్
Twitter losing 4 million dollors per day
భారీ మొత్తం చెల్లించి ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. ప్రస్తుతం కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో మస్క్ స్పందించారు. ట్విట్టర్ రోజూ 40 లక్షల డాలర్లు నష్టపోతోందని వెల్లడించారు. నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీని ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని ట్వీట్ చేశారు.

తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ అండగా ఉంటుందని మస్క్ చెప్పారు. మూడు నెలల పాటు వారికి 50 శాతం కంటే ఎక్కువే జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ సుమారు 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. కంపెనీ తన చేతుల్లోకి వచ్చిన వారంలోపే ఉద్యోగాలలో కోత మొదలు పెట్టారు. పొదుపు చర్యల్లో భాగంగా ట్విట్టర్ లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల నుంచి సాధారణ ఉద్యోగుల దాకా చాలామందిని ఇంటికి పంపించారు.

Related posts

షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్….! 

Ram Narayana

స్పెయిన్ లో నరమాంస భక్షకుడు… తల్లిని చంపి తినేశాడు:15 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష!

Drukpadam

విజయసాయిరెడ్డి, జగతి, భారతిలకు సుప్రీంకోర్టు నోటీసులు!

Drukpadam

Leave a Comment