Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సంప్రదాయానికి భిన్నంగా ఆర్మీ దుస్తుల్లో బ్రిటన్ రాజు పట్టాభిషేకం !

శతాబ్దాల సంప్రదాయానికి ముగింపు పలకనున్న బ్రిటన్ రాజు ఛార్లెస్!

  • పట్టాభిషేకం సమయంలో రాజ దుస్తులు ధరించడం ఆనవాయతీ
  • పట్టు వస్త్రాలకు బదలు ఆర్మీ యూనిఫాం ధరించాలనుకుంటున్న ఛార్లెస్
  • మే 6న బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం

మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఈ మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి ఛార్లెస్ దంపతులు స్వస్తి పలకనున్నట్టు తెలుస్తోంది. పట్టాభిషేకం సమయంలో రాజ దుస్తులను ధరించడం ఆనవాయతీగా వస్తోంది. రాజులు పట్టు వస్త్రాలను ధరించేవారు. అయితే ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టాలని ఛార్లెస్ భావిస్తున్నారని తెలుస్తోంది. రాజ దుస్తులకు బదులు ఆర్మీ యూనిఫాంలో పట్టాభిషేకానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.

లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ తర్వాతి రోజున విండ్సర్ క్యాజిల్ లో కూడా మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్యులను కూడా అనుమతించనున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 గత సెప్టెంబర్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఏడు దశాబ్దాల పాటు ఆమె బ్రిటన్ ను పాలించారు. ఆమె మరణానంతరం బ్రిటన్ రాజుగా ఛార్లెస్ బాధ్యతలను స్వీకరించారు.

Related posts

దేశంలో అగ్నిపథ్ చిచ్చు …బీహార్లో బీజేపీ కార్యాలయం ధ్వంసం …

Drukpadam

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాట రాసిన బెంగాల్​ సీఎం మమత!

Drukpadam

ప్రధానికి సీఎం స్వాగతం పలకాలని ప్రొటోకాల్ లో ఎక్కడా లేదు: తలసాని

Drukpadam

Leave a Comment