Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పది రోజుల్లోనే అదానీ సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి!

పది రోజుల్లోనే అదానీ సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి!

  • హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భారీగా నష్టపోతున్న అదానీ గ్రూప్ షేర్లు
  • 217 బిలియన్ డాలర్ల విలువ నుంచి 99 బిలియన్ డాలర్లకు పడిపోయిన అదానీ మార్కెట్ విలువ
  • ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానం నుంచి 21వ స్థానానికి అదానీ

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డారు. అదానీ సంస్థలకు చెందిన స్టాక్స్ అన్నీ స్టాక్ మార్కెట్ లో భారీగా పతనం అవుతున్నాయి. ఈ కారణంగా అదానీ సంపద ఆవిరవుతూనే ఉంది. ఈ నివేదిక వెలువడిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా 118 బిలియన్ డాలర్లు నష్టపోయింది. భారత కరెన్సీలో ఇది రూ. 9.73 లక్షల కోట్లు. 

అదానీ సంస్థల షేర్లు అన్నీ సగానికి పడిపోయాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కంటే ముందు అదానీ గ్రూప్ 217 బిలియన్ డాలర్ల విలువ కలిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఆ విలువ 99 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దాంతో, మొన్నటిదాకా ఆసియాలో అత్యంత సంపన్నుడిగా వెలుగొందిన అదానీ.. అగ్రస్థానాన్ని కోల్పోయారు. అలాగే, ప్రపంచ సంపన్ననుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఒక్కసారిగా 21వ స్థానానికి పడిపోయారు.

అదానీ సంస్థల అవకతవకల వార్తల నేపథ్యంలో.. భారత బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ కీలక ప్రకటనBanking sector stable says RBI on banks exposure to Adani Group

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంస్థల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో అలజడి నెలకొంది. దీనివల్ల భారత బ్యాంకింగ్ రంగం కూడా తీవ్ర ప్రభావానికి గురవుతుందన్న వార్తల నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పందించింది. స్టార్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు పతనం అవుతున్నప్పటికీ దేశంలోని బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ సెక్టార్‌పై, వ్యక్తిగత బ్యాంకులపై ఆర్బీఐ నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపింది. అయితే, తన ప్రకటనలో అదానీ గ్రూపు పేరును పేర్కొనలేదు.

‘ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన విషయంలో భారతీయ బ్యాంకుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియా నివేదికలు ఉన్నాయి. బ్యాంకుల రెగ్యులేటర్, సూపర్‌ వైజర్‌గా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించే ఉద్దేశ్యంతో బ్యాంకింగ్ రంగం, వ్యక్తిగత బ్యాంకులపై ఆర్బీఐ నిఘా ఉంచుతుంది. ఆర్బీఐ వద్ద సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ డేటాబేస్ సిస్టమ్ ఉంది. ఇది బ్యాంకులు రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ లావాదేవీలను నివేదిస్తాయి. ఇది పర్యవేక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఆర్బీఐ ప్రస్తుత అంచనా ప్రకారం, బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉంది. మూలధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, లిక్విడిటీ, లాభదాయకతకు సంబంధించిన వివిధ ప్రమాణాలు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి. బ్యాంకులు కూడా ఆర్బీఐ జారీ చేసిన లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటూ భారతీయ బ్యాంకింగ్ రంగం స్థిరత్వాన్ని పర్యవేక్షిస్తూనే ఉంది’ అని తన ప్రకటనలో పేర్కొంది. 

ఇదిలాఉండగా, అదానీ గ్రూప్ నష్టాల నేపథ్యంలో ఆ సంస్థలకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన వివరాలను అందజేయాల్సిందిగా వివిధ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించినట్టు తెలుస్తోంది.

Related posts

తమిళనాడు ఆదివాసీలతో కాలుకదిపిన రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో!

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారా …?

Drukpadam

ప్రతి ఒక్కరినీ కాపాడడం ప్రభుత్వానికి సాధ్యం కాదు: హర్యానా సీఎం

Ram Narayana

Leave a Comment