Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా…

బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు
-విచారణ వాయిదా…
-కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో బాలుడి మృతి
-మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు హైకోర్టు వెల్లడి
-జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించిన న్యాయస్థానం

హైదరాబాదు నగరంలో కొన్నిరోజుల కిందట వీధి కుక్కలు ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కాగా ఈ ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. వీధి కుక్కల అంశంలో జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించింది.

ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అంబర్ పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. బాలుడి మృతి బాధాకరమని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది . అయితే కేసు విచారణను వాయిదా వేశారు . దీనిపై ప్రభుత్వం సమగ్రమైన నివేదికతో రావాలని కోర్ట్ అభిప్రాయపడినట్లు సమాచారం …

Related posts

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు..!

Drukpadam

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాలుకు గాయం …ఢిల్లీ పర్యటన రద్దు!

Drukpadam

వాసాలమర్రి గ్రామంలో ప్రొఫెసర్ అవతారం ఎత్తిన సీఎం కేసీఆర్…….

Drukpadam

Leave a Comment