రాజకీయ వార్తలు

కాంగ్రెస్ నేత కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్న యెడ్యూరప్ప కొడుకు!

కాంగ్రెస్ నేత కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్న యెడ్యూరప్ప కొడుకు!

  • షికారిపుర నుంచి పోటీ చేస్తున్న యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర
  • తుమకూరు సమీపంలోని సిద్ధలింగేశ్వర ఆలయానికి వచ్చిన విజయేంద్ర
  • అదే సమయంలో ఆలయంలో ఉన్న పరమేశ్వర

ఎన్నికల సందర్బంగా కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర కాళ్లకు నమస్కరించి, ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. యెడ్డీకి కంచుకోట అయిన షికారిపుర నుంచి విజయేంద్ర పోటీ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఆయ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో తుమకూరు సమీపంలోని యెడియూర్ లోని సిద్ధలింగేశ్వర ఆలయానికి ఆయన వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, షెడ్యూల్డ్ కులాల నేత పరమేశ్వర అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పరమేశ్వర ఆశీస్సులను విజయేంద్ర తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts

వైసీపీ నేత సుబ్బారావు గుప్తా కు నిన్న దెబ్బలు నేడు కేకులు…

Drukpadam

ఇంతకీ ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ లో ఉన్నట్టా ? లేనట్టా ?

Drukpadam

ఏపీలో బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లొద్దంటూ సర్కార్ రూల్…చంద్రబాబు ఫైర్…

Drukpadam