Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ ను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి 800 కిమీ సైకిల్ తొక్కుతూ వచ్చిన రైతు…

జగన్ ను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి 800 కిమీ సైకిల్ తొక్కుతూ వచ్చిన రైతు…

  • ఎల్లలు దాటిన అభిమానం
  • సీఎం జగన్ పై అభిమానం పెంచుకున్న మహారాష్ట్ర రైతు
  • షోలాపూర్ జిల్లా నుంచి సైకిల్ తొక్కుతూ తాడేపల్లి చేరుకున్న వైనం
  • ఆప్యాయంగా స్వాగతించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ పై అభిమానం రాష్ట్రాల సరిహద్దులు దాటింది. ఓ మహారాష్ట్ర రైతు సీఎం జగన్ పై అభిమానంతో మహారాష్ట్ర నుంచి సైకిల్ తొక్కుతూ వచ్చాడు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నా, ఆయన విధానాలు అన్నా లక్ష్మణ్ కాక్డే ఎంతో అభిమానించేవాడు. దాంతో జగన్ ను ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు.

ఈ నెల 17న మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి ఓ సైకిల్ పై బయల్దేరాడు. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తాడేపల్లి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి మురిసిపోయాడు.

కాక్డే గురించి తెలుసుకున్న సీఎం జగన్ ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించారు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టు ధరించాడు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అంటూ రాసి ఉంది.

Related posts

వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి…

Drukpadam

స్పెయిన్ లో నరమాంస భక్షకుడు… తల్లిని చంపి తినేశాడు:15 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష!

Drukpadam

తీన్మార్ మల్లన్నపై 10కోట్లకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రువు న‌ష్టం దావా!

Drukpadam

Leave a Comment