Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు..తిప్పికొట్టిన వసుంధర రాజే!

రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధర రాజే సాయం చేశారన్న గెహ్లాట్!

  • 2020లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమిత్ షా కుట్ర పన్నారన్న గెహ్లాట్
  • బీజేపీ నేత వసుంధర రాజే, మరో ఇద్దరు కలిసి ఆ కుట్రలను అడ్డుకున్నారన్న సీఎం
  • గతంలో తాను బీజేపీ ప్రభుత్వం కూలిపోకుండా అడ్డుకున్నానన్న గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రమంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి కుట్ర పన్నారని, అయితే ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే, మాజీ స్పీకర్ కైలాశ్ మేఘ్‌వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా కలిసి తమ ప్రభుత్వాన్ని కాపాడారని గెహ్లాట్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వారు అడ్డుకున్నారని అన్నారు.

అప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తాను మద్దతు ఇవ్వలేదని, అలాగే, 2020లో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వారు మద్దతు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిందన్న గెహ్లాట్ .. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోమారు అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.

అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన వసుంధర రాజే

Vasundhara Rajes Counter After Ashok Gehlots Bombshell

తన ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మరో ఇద్దరు బీజేపీ నేతలు సాయం చేశారంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన సంచలన వ్యాఖ్యలపై వసుంధర రాజే స్పందించారు. ఆయన వ్యాఖ్యలు ‘అవమానకరమని’, ‘కుట్రపూరితమని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లో మరెవరూ అవమానించని విధంగా గెహ్లాట్ తనను అవమానించారని రాజే మండిపడ్డారు.

జులై 2020లో అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, 18 మంది ఆయన విధేయులు కలిసి గెహ్లాట్‌పై తిరగబడ్డారు. దీంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దాదాపు నెల రోజులపాటు కొనసాగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోక్యంతో సంక్షోభం చల్లబడింది. ఆ తర్వాత పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.

గెహ్లాట్ నిన్న మాట్లాడుతూ.. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు హోంమంత్రి అమిత్ షా, గజేంద్ర షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి కుట్ర పన్నారని, కొందరు ఎమ్మెల్యేలకు డబ్బును ఎరగా చూపారని ఆరోపించారు. అప్పుడు వసుంధర రాజే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కలాశ్ మేఘవాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా కలిసి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని అన్నారు.

అప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది ఆమోదయోగ్యం కాకపోవడంతో తాను మద్దతు ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. దీనికి ప్రతిగా 2020లో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వసుంధర రాజే మద్దతు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిందన్న గెహ్లాట్ .. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోమారు అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

“ప్లీజ్ న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు”.. బోర్డు ప‌రీక్ష‌ల్లో రాసిన విద్యార్థిని!

Drukpadam

పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు: పేర్ని నాని!

Drukpadam

భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్… ప్రధాని మోదీతో సమావేశం

Drukpadam

Leave a Comment