జాతీయ వార్తలు

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణీకులు…

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణీకులు…

  • చెన్నై బేసిన్ బ్రిడ్జి వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్ నుండి మంటలు 
  • రైలు చెన్నై నుండి ముంబై వెళ్తుండగా ప్రమాదం 
  • ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం రాత్రి హఠాత్తుగా మంటలు రావడం కలకలం రేపింది. చెన్నై బేసిన్ బ్రిడ్జి వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు బోగీల నుండి బయటకు పరుగుతీశారు. ఈ రైలు చెన్నై నుండి ముంబై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరిన అరగంట తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఇక్కడి నుండి రైలు గం.6.20కి బయలుదేరింది. గం.6.48 సమయంలో మంటలు వచ్చాయి. పలువురు ప్రయాణీకులు మంటలు వస్తున్న దృశ్యాన్ని తమ ఫోన్ లలో బంధించారు. ఆ తర్వాత గం.7.15 నిమిషాలకు ఈ రైలు వ్యాసపార్ది జీవా స్టేషన్ నుండి తిరిగి బయలుదేరింది.

Related posts

ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు!

Ram Narayana

దళితుల్ని గుళ్లోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి..!

Ram Narayana

షక్సాగామ్ లోయ తమదేనన్న చైనా… ఆ ఒప్పందం చెల్లదన్న భారత్

Ram Narayana