Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

రష్యా లూనా-25 కూలిపోయిన నేపథ్యంలో… యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు చంద్రయాన్-3 పైనే!

  • ఆగస్టు 11న చంద్రుడిపైకి లూనా-25ని ప్రయోగించిన రష్యా
  • ఇవాళ క్రాష్ ల్యాండింగ్
  • సాంకేతికలోపంతో కుప్పకూలిన వైనం
  • ఈ నెల 23న చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్-3
  • తాజాగా రెండో డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతం

రష్యా ఎంతో ప్రతిష్ఠాత్మక రీతిలో ఈ నెల 11న ప్రయోగించిన లూనా-25 మూన్ మిషన్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. జాబిలి దక్షిణ భాగంపై దిగే క్రమంలో లూనా-25 ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. దాంతో ఆ స్పేస్ క్రాఫ్ట్ కు భూమితో సంబంధాలు తెగిపోయాయి. తమ ప్రయోగం విఫలమైందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3పై నిలిచింది. మరో మూడు రోజుల్లో చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ భాగంలో దిగనుంది. రష్యా మూన్ మిషన్ విఫలమైన నేపథ్యంలో, భారత చంద్రయాన్-3 పరిస్థితి ఎలా ఉండనుంది? అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

తాజాగా చంద్రయాన్-3 కక్ష్యను 25/134 కిలోమీటర్లకు తగ్గించే రెండో డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. దాంతో చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ ప్రక్రియ విజయవంతం కావడం భారత శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. గతంలో చంద్రయాన్ విఫలమైనా, ఈసారి అనుకున్నది సాధిస్తామని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. 

అన్నీ అనుకున్నట్టుగా సాగితే చంద్రయాన్-3 ల్యాండర్ ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష శాస్త్రజ్ఞులందరూ భారత చంద్రయాన్-3 పురోగమిస్తున్న తీరును అత్యంత ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

Related posts

భారత్‌కు కెనడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Ram Narayana

స్విట్జర్లాండ్ లో బుర్ఖా వేసుకుంటే ఫైన్

Ram Narayana

భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్‌లను భారీగా తగ్గించిన కెనడా

Ram Narayana

Leave a Comment