ఆంధ్రప్రదేశ్

తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం

  • ఇటీవల ఓ బాలికపై దాడిచేసి చంపేసిన చిరుత
  • ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • శని, ఆదివారాల్లో సంచరిస్తూ కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు

తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. అలిపిరి మార్గంలో ఇటీవల ఓ బాలికపై చిరుత దాడిచేసి చంపేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది.   

నడకమార్గంలోని ఏడో మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు సంచరిస్తూ కనిపించాయి. నిన్న సాయంత్రం నరసింహస్వామి ఆలయ సమీపంలోనూ ఎలుగుబంటి సంచరించింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడకదారి భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టారు.

Related posts

గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు… గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు!

Ram Narayana

బీజేపీకీ, మోడీకి యూనిఫామ్ కావాలి, కాంగ్రెస్ అన్నింటినీ గౌరవిస్తుంది-రాహుల్ వ్యాఖ్యలు…

Drukpadam

వస్త్ర వ్యాపారులకు ఊరట …జీఎస్టీ పెంపు ఇప్పట్లో లేనట్టే!

Drukpadam