Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ కు ఏమైంది …విజయవాడ ఆసుపత్రిలో నాలుగు గంటలు …

సీఎం జగన్‌కు వైద్య పరీక్షలు

  • కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న సీఎం జగన్
  • సోమవారం విజయవాడలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షలు
  • ఎమ్మారైతో పాటూ వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. 
  • పరీక్షల సందర్భంగా జగన్ వెంటే ఆయన భార్య 
  • పరీక్షల అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సీఎం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది …సోమవారం ఆయన విజయవాడలోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో నాలుగు గంటలకు పైగా ఎందుకు ఉన్నారు . ఏమేమి పరీక్షలు చేయించుకున్నారు . చిన్న చికిత్స అయితే అన్ని గంటలు ఉండాల్సిన అవసరం ఏముంది .అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ..చాల సందర్భాలలో ఆయన కాలు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం .. గతంలో జిమ్ చేస్తున్న సందర్భంగా కాలు బెణికింది వార్తలు వచ్చాయి . ఒక సందర్భంలో ఢిల్లీ వెళ్లలేక ముందుగా అనుకున్న కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ..మళ్ళీ కాలు నొప్పి తిరగ బెట్టిందని అందువల్లనే ఆయన్ను భార్య భారతి బలవంతంగా ఆసుపత్రికి తీసుకోని వచ్చిందని సమాచారం …

కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో ఈ పరీక్షలు చేయించుకున్నారు. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లారు. 

ఎమ్మారై స్కాన్‌తో పాటూ ఆయన వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ల్యాబ్‌లో ఆయన సుమారు రెండు గంటలపాటు ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా జగన్ వెంట ఆయన భార్య భారతి రెడ్డి కూడా ఉన్నారు. పరీక్షల అనంతరం జగన్ మూడు గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.

Related posts

కారు ట్రబుల్​ ఇచ్చింది.. రూ.80 లక్షల లాటరీ తగిలింది!

Drukpadam

ట్విట్టర్‌పై ఎంపీల ప్రశ్నల వర్షం.. రాతపూర్వకంగా సమాధానం ఇస్తామన్న ప్రతినిధులు…

Drukpadam

రెండు రోజుల పాటు మూత పడ‌నున్న తిరుమ‌ల ఆల‌యం.. కార‌ణాలివే!

Drukpadam

Leave a Comment