Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ బీసీలకు గాలం…ప్రతిపార్లమెంట్ పరిధిలో ఇద్దరికీ టికెట్స్ …

కాంగ్రెస్ బీసీలకు గాలం…ప్రతిపార్లమెంట్ పరిధిలో ఇద్దరికీ టికెట్స్ …
సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఠాక్రే
కీలక హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇస్తామని వెల్లడి
ప్రతి పార్లమెంట్ పరిధిలో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని హామీ

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది..అందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఇద్దరు బీసీలకు టికెట్స్ ఇస్తామని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే అన్నారు ….సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాము వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కీలక హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డు తీసుకు వెళ్తామన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఇద్దరు బీసీలకు తాము ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు భేటీ కానుంది. ఇటీవలి వరకు పోటీ చేసే ఆశావహుల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ జాబితాను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే దిశగా అడుగులు వేయనుంది. సర్వేల ఆధారంగా, సామాజిక కోణం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థుల జాబితాను పరిశీలించి, స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేస్తుంది. సెప్టెంబర్ మూడో వారంలో అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చునని తెలుస్తోంది.

Related posts

బీఫాం ఇచ్చినా పత్తాలేని ఎంఐఎం అభ్యర్థి.. చివరి నిమిషంలో మరో అభ్యర్థి నామినేషన్

Ram Narayana

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించిన కేసీఆర్

Ram Narayana

అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీకి రెడీ: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment