Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

రఘురామ గాయాలు కస్టడీలోనే అయ్యాయని సైనిక ఆసుపత్రి చెప్పలేదు: ఏపీ సీఐడీ!

రఘురామ గాయాలు కస్టడీలోనే అయ్యాయని సైనిక ఆసుపత్రి చెప్పలేదు: ఏపీ సీఐడీ!
-రఘురామకు ఎడిమా ఉందని మాత్రమే చెప్పింది
-వైద్యులు ఇచ్చిన ఏ ఒక్క నివేదికలో గాయాల ప్రస్తావన లేదు
-అలా ప్రచారం చేయడం తగదు
-రఘురామ కాలు గాయాలపై పరస్పర ఆరోపణలు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కాళ్లకు అయిన గాయాలపై ఏపీ సీఐడీ స్పష్టత ఇచ్చింది. రఘురామకు పోలీసు కస్టడీలోనే గాయాలు అయ్యాయని కానీ, ఆయనకు గాయాలు ఉన్నాయని కానీ సైనిక ఆసుపత్రి ఎక్కడా చెప్పలేదని సీఐడీ పేర్కొంది. కాబట్టి ఇందుకు విరుద్ధంగా చెప్పడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు సైనిక ఆసుపత్రి సమర్పించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొందని గుర్తు చేసింది. సైనిక ఆసుపత్రి నివేదికకు ముందే మూడుసార్లు వైద్యులు పరిశీలించి నివేదిక ఇచ్చారని, వాటిలో రఘురామకు గాయాలు అయినట్టు ఎక్కడా చెప్పలేదని పేర్కొంది.

అలాగే, రఘురామను గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరచడానికి ముందు జారీ చేసిన ఫిట్‌నెస్ ధ్రువపత్రం, గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక, గుంటూరు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన నివేదికలోనూ ఎక్కడా రఘురామకు గాయాలు ఉన్నట్టు పేర్కొనలేదని వివరించింది. సైనిక ఆసుపత్రి కూడా ఇదే విషయాన్నిచెప్పిందని, ఆయనకు ఎడిమా ఉందని తప్పితే కస్టడీలోనే గాయాలు అయినట్టు ఎక్కడా పేర్కొనలేదని వివరించింది. కాబట్టి గాయాలు ఉన్నట్టు సైనికాసుపత్రి ధ్రువీకరించిందని చెప్పడం సరికాదని సీఐడీ పేర్కొంది.

రఘురామ గాయాలపై పరస్పర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన్ను సి ఐ డి పోలీసులు కస్టడీలో తీవ్రంగా గాయపరిచారని అందువల్లనే గాయాలు అయ్యాయని రఘురామ రాజు కోర్ట్ కు తెలిపారు. అందుకు సంబందించిన ఆధారాలు ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం తెలిపారు. రఘురామ రాజు కుటుంబసభ్యులు సైతం గాయాలైయ్యాయని చెప్పారు. చివరకు ఏపీ పోలీసులు తన భర్తను చంపుతారని అనుమానాలు వ్యక్తం చేస్తూ హోమ్ మంత్రి అమిత్ షా, లోకసభ స్పీకర్ ఓం బిర్లా కు ఫిర్యాదు చేశాయి. సుప్రీం కోర్ట్ సైతం రఘురామకు గాయాలైయ్యాయని గాని కాలేదని గాని చెప్పలేదు . ఎవరికీ వారు తమ సొంత భాష్యాలు చెప్పుకుంటున్నారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ఏమి సుప్రీం కోర్ట్ కి ఏమి చెప్పింది.అనేది వెల్లడి కాలేదు .అయితే ఏపీ సి ఐ డి మాత్రం ఆర్మీ ఆసుపత్రి నివేదికలో రఘరామకు గాయాలు అయినట్లు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని చెప్పటం కొసమెరుపు …

Related posts

ప్రాణం పోయేంత వరకు బీజేపీతో కలవను: నితీశ్ కుమార్

Drukpadam

కేంద్రమంత్రి తీరు బాధాకరం …పరామర్శకు వచ్చారా ?ఫోటోల కోసమా ?

Drukpadam

అవినీతి పై బీహార్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

Leave a Comment