ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత: స్పర్శ దర్శనం కోసం శివస్వాముల ఆందోళన, బారికేడ్లు ధ్వంసం!

  • శ్రీశైలంలో స్పర్శ దర్శనంపై తీవ్ర గందరగోళం
  • ఊహించని రద్దీతో గంటల తరబడి నిరీక్షించిన శివస్వాములు
  • సహనం కోల్పోయి బారికేడ్లు, కంచెలు ధ్వంసం
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల రంగప్రవేశం
  • రాత్రి వరకు కొనసాగిన ఆందోళనలు, ఉద్రిక్తత

శ్రీశైలం క్షేత్రంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పర్శ దర్శనంలో తీవ్ర జాప్యం జరగడంతో శివస్వాములు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. బారికేడ్లను, గేట్లను ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది.

మండల దీక్ష పూర్తిచేసుకుని పాదయాత్రగా వచ్చే జ్యోతిర్ముడి శివస్వాములకు నాలుగు రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ప్రకటించింది. దీంతో ఊహించని రీతిలో భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో, గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్న భక్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. చంద్రావతి కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, కంచెలను తొలగించి గుంపులుగా ఆలయం వైపు దూసుకెళ్లారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లకు ఉన్న తాళాలు పగలగొట్టారు.

ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు, సిబ్బందిపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వెంటనే పోలీసు భద్రతను పెంచారు. ఏఎస్పీ యుగంధర్ బాబు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి 10 గంటలు దాటినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు, పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు భక్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో క్షేత్రంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.

Related posts

న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? ఒప్పుకోము’- సుప్రీంకోర్టు!

Ram Narayana

Governor can’t call for floor test based on difference of opinion of MLAs in party: SC

Drukpadam

స్వీడెన్ లో సెక్స్ ఛాంపియన్ షిప్ నా …అంతా వట్టిదే …!

Drukpadam