Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

  • రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
  • గతంలోనే కవితను విచారించిన ఈడీ
  • పిళ్లై అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో మరోసారి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (రేపు) విచారణకు రావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో కవితను ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారాడు. ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారులు రికార్డ్ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో రామచంద్ర పిళ్లై కంటే ముందు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరాలు అప్రూవర్‌గా మారారు. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారింది.

Related posts

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్లు…

Ram Narayana

కుప్పం వైసీపీ నేత మృతి.. హత్య చేశారన్న తమ్ముడు!

Drukpadam

ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలుకింద పడి మహిళ ఆత్మహత్య…

Drukpadam

Leave a Comment