కోర్ట్ తీర్పులు

ఏసీబీ కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు!

  • బెయిల్, మధ్యంతర బెయిల్… రెండు పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు
  • రేపు కౌంటర్ దాఖలు చేయనున్న సీఐడీ
  • ఈ రెండు పిటిషన్లు ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీకి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఐడీ రేపు కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ పిటిషన్లు ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశముంది.

Related posts

మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు…

Ram Narayana

ఏపీ హైకోర్టు రోస్టర్‌లో కీలక మార్పులు

Ram Narayana

కవితకు తీవ్ర నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు..

Ram Narayana