ఆంధ్రప్రదేశ్

జగన్‌కు స్వల్ప అస్వస్థత, మధ్యాహ్నం అపాయింట్‌మెంట్లన్నీ రద్దు!

  • వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ముఖ్యమంత్రి జగన్
  • కేబినెట్ సమావేశం అనంతరం అపాయింట్‌మెంట్లన్నీ రద్దు
  • రేపటి నుంచే ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుండి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన అపాయింట్‌మెంట్లన్నింటినీ అధికారులు రద్దు చేశారు. అంతకుముందు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌లు పాల్గొన్నారు.

Related posts

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ!

Drukpadam

అమూల్ పాల ధ‌ర పెంపు.. రేప‌టి నుంచే అమ‌ల్లోకి

Drukpadam

ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన అవినాశ్ రెడ్డి న్యాయవాది…

Drukpadam