Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవితకు ఊరట

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత
  • తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సుప్రీంలో సవాల్ చేసిన కవిత
  • తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ… సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితకు సమన్లను జారీ చేయబోమని తెలిపింది.

Related posts

అదే ఆప్యాత అవే పలకరింపులు …వరద ప్రాంతాలలో సీఎం జగన్ పర్యటన!

Drukpadam

తెలుగులో రాగులు…. ఇంగ్లీషులో ఫింగర్ మిల్లెట్స్… లాభాలేంటో చూద్దాం!

Drukpadam

హెచ్ 1 బి విసదారులకు వారి భాగస్వాములకు అమెరికా శుభవార్త ….

Drukpadam

Leave a Comment