Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుజాతీయ వార్తలు

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా…తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు ..

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా…తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు ..
ఐదు రాష్ట్రాల కౌంటింగ్ డిసెంబర్ 3 వ తేదీ న …
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3 న ,
నామినేషన్స్ స్వీకరణ చివరి తేదీ నవంబర్ 10 వ తేదీ ..
13 తేదీ నామినేషన్స్ పరిశీలిన ,15 తేదీ వరకు ఉపసంహరణ
మిజోరాంలో నవంబర్ 7 ఎన్నికలు …మధ్యప్రదేశ్ లో నవంబర్ 17 ఎన్నికలు
ఛత్తీస్ ఘడ్ లో నవంబర్ 7 ,17 రెండు విడతలు , రాజస్థాన్ లో నవంబర్ 23 ఎన్నికలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 న …డిసెంబర్ 5 ఎన్నికల ప్రక్రియ పూర్తీ ..

ఎప్పుడా….ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది….ఈ విషయాన్నీ ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని ఎన్నికకు కమిషన్ కార్యాలంయంలో షడ్యూల్ ప్రకటించారు .
మిజోరాం లో నవంబర్ 7 న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు ..
ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు నవంబర్ 7 ,17 రెండు విడతలు
మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17 ఒకేరోజు
రాజస్థాన్ ఎన్నికలు నవంబర్ 23 ఒకే రోజు
అదే విధంగా నవంబర్ 30 న తెలంగాణ ఎన్నికలు ఒకేరోజు
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 తేదీన జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది…డిసెంబర్ 5 మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తీ అవుతుందని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 3 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు ..ఆరోజు నుంచి నవంబర్ 10 వ తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు …పరిశీలన నవంబర్ 13 న జరగనుండగా , నవంబర్ 15 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ …పోలింగ్ నవంబర్ 30 జరగనుండగా , మిగతా రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3 వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది..డిసెంబర్ 5 తో ఎన్నికల ప్రక్రియ పూర్తీ అవుతుంది….

తెలంగాణాలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా , రాజస్థాన్ లో 200 స్థానాలకు , మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు , ఛత్తీస్ ఘడ్ లో 90 స్థానాలకు ,మిజోరాం లో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకుఎన్నికలు జరగనుండగా ,16 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు . ప్రశాంతంగా ఎన్నికల నిర్వాణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు .

Related posts

చారిత్రక హౌరా బ్రిడ్జ్ సామర్థ్యాన్ని పరీక్షించనున్న నిపుణులు….

Drukpadam

బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!

Ram Narayana

రాజస్థాన్ ముఖ్యమంత్రికి హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..!

Ram Narayana

Leave a Comment