ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఇక ప్రజాక్షేత్రంలోకి.. నారా భువనేశ్వరి కీలక నిర్ణయం!

  • నిజం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న భువనేశ్వరి
  • వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటన
  • వారానికి కనీసం రెండుమూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా మళ్లీ ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొంటారు. ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి పాదయాత్ర చేపడతారు. అప్పటి వరకు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

Related posts

జనసేనలోకి ముద్రగడ.. స్వయంగా ఆహ్వానించనున్న పవన్ కల్యాణ్

Ram Narayana

తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని వ్యక్తి చంద్రబాబు…వయస్సుకు తగినట్లుగా మాట్లాడాలి: పేర్ని నాని…

Ram Narayana

పులివెందుల టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు.. వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు

Ram Narayana