Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి, అధికారం ఖాయం… సీఎల్పీ నేత భట్టి !

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి, అధికారం ఖాయం… సీఎల్పీ నేత భట్టి !
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భట్టి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దొరలపాలన
తెలంగాణ సంపదను లూటీ చేసిన కేసీఆర్
రాష్ట్రాన్ని అప్పులు పలు చేసిన కేసీఆర్

సీఎం భట్టి భట్టి అంటూ నినాదాలు …

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు ..మధిర నియోజకవర్గ ప్రచారంలో ఆయన రెండవరోజు మండల కేంద్రమైన ముదిగొండలో ప్రచారం నిర్వహించారు .ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజల్లో చర్చజరుగుతోంది అన్నారు .కేసీఆర్ మోసపు మాటలను ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు .రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి అభివృద్ధి అంటూ ఉదరగొడుతున్నారని ధ్వజమెత్తారు .కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తెలంగాణ రాలేదు దొరలే తెలంగాణను ఏలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .సామాజిక తెలంగాణ, ప్రజల తెలంగాణ వస్తనే ప్రజలు కన్న కలలు నెరవేరుతాయని ఆదిశగా ప్రజలు ఆలోచనలు చేయాలనీ అన్నారు . ..10 ఏండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు తెలంగాణ సంపదను లూటీ చేశారని విమర్శలు గుప్పించారు .

అభివృద్ధి పేరిట తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పు, పది సంవత్సరాల బడ్జెట్ 18 లక్షల కోట్లు ఏం చేశారు?.. పూర్తిగా నూతన ప్రాజెక్టులు కట్టలేదు. కొత్త పరిశ్రమలు తేలేదు. తెలంగాణ సంపద ఎటు పోయిందని ప్రశ్నించారు … కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు కు సవాల్ చేస్తున్నానని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలే? మూడెకరాల భూమి ఇస్తానని ఎందుకు ఇవ్వలే? ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పి ప్రచారం చేయండని లేకపోతె వారికీ ప్రచారం చేసే నైతిక విలువలేదని అన్నారు
కాంగ్రెస్ చెప్పినట్టుగా ఉచిత కరెంటు ఇచ్చింది రైతులకు రుణమాఫీ చేసింది ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి చూపించింది కాంగ్రెస్ కదా ..?అని అన్నారు .
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం…పేద విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తాం….కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల హామీలను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అమలు చేసి చూపిస్తామన్నారు

ప్రశ్నపత్రాల లీకులతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన సీఎం కేసీఆర్…
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం…ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా సమాజానికి మేలైన మానవ వనరులుగా య్కఉపయోగపడాల్సిన మేధస్సును నిర్వీర్యం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం…

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బంగారు తల్లి పథకాన్ని చంపేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట కేవలం లక్ష 116 రూపాయలు ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం…తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన దొరల ప్రభుత్వాన్ని ఓడించి రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం… మధిరలో మీరు వేసే ఓటు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్థితిగతులను మార్చే ఓటు అని భట్టి అన్నారు .

సీఎం భట్టి భట్టి అంటూ నినాదాలు …

ముదిగొండ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల సభలో భట్టి సీఎం సీఎం అంటూ ప్రజలు నినదించారు . ప్రత్యేకంగా యువకులు ఈ నినాదాలు ఇవ్వడం గమనార్హం…

Related posts

నామ గెలుపు ఖాయం ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది …”దృక్పధం” తో మాజీమంత్రిపువ్వాడ…

Ram Narayana

 కేటీఆర్! ఎగిరిపడకు… తరిమికొట్టకుంటే నాపేరు షబ్బీర్ అలీయే కాదు: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana

ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు : ఎంపీ నామ

Ram Narayana

Leave a Comment