ఆంధ్రప్రదేశ్

ఏపీలో రేపటి నుంచే కులగణన

  • ప్రయోగాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహణ
  • కలెక్టర్ల పర్యవేక్షణలో 5 ప్రాంతాల్లో చేపట్టనున్న అధికారులు
  • ఐదు పట్టణాలలో ప్రాంతీయ సదస్సులు

ఆంధ్రప్రదేశ్ లో కులగణన దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బుధవారం నుంచి జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఐదు పట్టణాలలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం మేరకు ఈ నెలాఖరు నుంచి పూర్తిస్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, 20న విశాఖపట్నం, విజయవాడ, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Related posts

తమిళనాడులో కొత్త ప్రయోగం.. అందరికి ఆరోగ్యం బిల్లుకు కసరత్తు!

Drukpadam

భద్రాచలం సీతారాముల కల్యాణంలో చిన్నజియ్యర్ సోత్కర్ష…!

Drukpadam

జపాన్ కుబేరుడు అంతరిక్ష యాత్ర సక్సెస్… సురక్షితంగా భూమి పైకి!

Drukpadam