Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల సందేహాలను నివృత్తి చేసిన నడ్డా …. పార్టీలో చేరికపై క్లారిటీ…

ఈటల సందేహాలను నివృత్తి చేసిన నడ్డా …. పార్టీలో చేరికపై క్లారిటీ
ఈటల సందేహాలతో కొన్ని …..
– బీజేపీ, టీఆర్ఎస్ చేతులు కలపవనే గ్యారంటీ ఉందా?
– కలిపితే టీఆర్ యస్ కు వ్యతిరేకంగా వచ్చిన మాలాంటోళ్ల పరిస్థితి ఏమిటి?
-బీజేపీ-టీఆర్ఎస్ ఒకేటనని ప్రజలు భావిస్తున్నారు కదా ?
-రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపై కేంద్రం స్పందిచడం లేదు ..
-టీఆర్ఎస్‌తో పోరు కొనసాగుతుందన్న నడ్డా
-బెంగాల్ లో మూడు సీట్ల నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే దాక వచ్చాం
-తెలంగాణాలో అంతకన్నా ఎక్కువ ప్రణాళికలు ఉన్నాయన్న నడ్డా
–రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా
-ఉద్యమకారులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ
-ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయం నియోజకర్గ కార్యకర్తలతో చర్చిస్తా అన్న ఈటల

బీజేపీలో చేరిక దాదాపు ఖాయమైన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల పలు సందేహాలు లేవనెత్తారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకేటనన్న భావన ప్రజల్లో ఉందని అన్నారు. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే పార్టీనే నమ్ముకుని వచ్చిన తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఈటల ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు. ఈటల సందేహాలకు నడ్డా బదులిచ్చారు. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ మూడు స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదిగామని, తెలంగాణలోనూ అంతకుమించిన దూకుడు ప్రదర్శిస్తామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నడ్డా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. ఉద్యమకారుల కు భరోసా కల్పిస్తామన్నారు . కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి తమకు అంత తెలుసునని సమయం వచ్చినప్పుడు తప్పకుండ చర్యలు తీసుకుంటామని అన్నారు . రాష్ట్రంలో నిజమైన ఉద్యమకారులకు అన్వయం జరుగుతుందని తెలిపారు . పార్టీలో మంచి పొజిషన్ ఇస్తామని ఈటలకు నడ్డా హామీ ఇచ్చారు. దీనిపై ఈటల సమాధానం ఇస్తూ తన నియోజక కార్యకర్తలతో మాట్లాడి పార్టీలో చేరతానని చెప్పినట్లు తెలిసింది . అయితే ఎమ్మెల్యే పదవి రాజీనామా విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం . ఇందుకు పార్టీలో చేరితే పార్టీ నిర్ణయం ప్రకారమే ఉండాలి కదా అని ఈటల నడ్డాతో అన్నట్లు తెలుస్తుంది. నడ్డాతో జరిగిన భేటీలో ఈటలతో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ తెలంగాణ ఇంచార్జి , మాజీ ఎంపీ వివేక్ వేంకటస్వామి , టీఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఉన్నారు.

Related posts

మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. ఏపీ, తెలంగాణలో మహిళలకు దక్కే సీట్లు ఎన్నంటే..!

Ram Narayana

బెంగాల్‌లో వామపక్షాల పై మమత సానుభూతి!

Drukpadam

రైతులపై దాడి చేయించిన అధికారిపై చర్యలు: స్పష్టం చేసిన హరియాణా డిప్యూటీ సీఎం

Drukpadam

Leave a Comment